హైలైట్:
- భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం
- వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసిన మ్యాచ్
- చెస్టర్ లీ స్ట్రీట్లో భారత్ ఆడిన మూడో మ్యాచ్ రద్దు
PUBLISHED BY:
రవి కుమార్ | Samayam Telugu
Published: Jul. 02, 2026 01:20 pm
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అభిషేక్ శర్మ (59), శ్రేయస్ అయ్యర్ (68) హాఫ్ సెంచరీలతో 189 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం తీవ్రం కావడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్కు వీలుపడలేదు. అంపైర్లు డీఎల్ఎస్ పద్ధతిలో ఓవర్లను కుదించినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు.
Image Credit | BCCI
England vs India In Google Trends: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం అయింది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే భారత బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం కురిసింది. ఎంతకీ తగ్గక పోవడంతో మ్యాచ్ రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.
ఐర్లాండ్తో సిరీస్లో తేలిపోయిన భారత బ్యాటర్లు.. వేదిక మారగానే సత్తాచాటారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 24 బంతుల్లో 59 రన్స్ బ్యాట్ ఝుళిపించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68 రన్స్) సైతం ఫర్వాలేదనిపించాడు. చివర్లో శివమ్ దూబె (21 బంతుల్లో 42 రన్స్) మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. దీంతో 7 వికెట్ల నష్టానికి టీమిండియా 189 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
నిజానికి ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కానీ ఆటకు అంతరాయం కలిగేంత కాదు. ఆ చిరు జల్లుల మధ్య భారత బ్యాటింగ్ కొనసాగించారు. కానీ ఇన్నింగ్స్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షం ఎక్కువ కావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యారు. వర్షం తగ్గితే మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు ప్రయత్నించారు. అందుకోసం ఇంగ్లాండ్ లక్ష్యాన్ని సవరించారు.
17 ఓవర్లలో 169 పరుగులు
కానీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. మరోవైపు చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచులు ఫలితం రాకుండానే ముగియడం గమనార్హం. 2002, 2011లో ఇంగ్లాండ్తో జరగాల్సిన వన్డే మ్యాచులలో ఫలితం రాలేదు. వర్షం కారణంగా ఆ మ్యాచులు రద్దు చేశారు. తాజా సిరీస్లో తొలి టీ20 మ్యాచ్ కూడా వర్షార్పణ అయింది. ఈ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ జులై 4న జరగనుంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20కు వర్షం పదే పదే ఆటంకం కలిగించడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో తెల్లవారి నిద్రలేవగానే మ్యాచ్కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు గూగుల్లో వెతికారు. దీంతో England vs India కీవర్డ్ 5 లక్షలకుపైగా సెర్చ్ వాల్యూమ్తో గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నిలిచింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్..